*గాంధారి మండలం లో జరుగుతున్న దొంగతనాలపై పలు సూచనలు *
*ఎస్సై ఆంజనేయులు పలు జాగ్రత్తలు తెలిపారు*
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 10 కామారెడ్డి జిల్లా
గాంధారి మండల కేంద్రంలో దొంగతనాలు జరుగుతున్న క్రమంలో ఎస్సై ఆంజనేయులు పలు జాగ్రత్తలు తెలియడం జరిగింది. దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మీ గ్రామ పరిధి లో ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా . ఆరుబయట నిద్రించవద్దని . ఊర్లలోకి వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు వస్తువులు ఇంట్లో ఉంచకుండా చూసుకోవాలని,
ఒకవేళ తాళం వేస్తే ఆ తాళం బయటకి కనిపించకుండా ఉండేటట్లు చూడాలని. ఆరు బయట బట్టలు ఆరవేసి ఉండాలని, ఎవరైనా ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇచ్చి వెళ్లే విధంగా మరియు జాగ్రత్తగా ఉండే విధంగా పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వారం రోజులపాటు చాటింపు వేయించాల్సిందిగా .
మరియు గ్రామాలలో చెత్త బండి మైక్ ల ద్వారా మరియు గుడి వద్ద, చర్చిల వద్ద, సౌండ్ సిస్టం ద్వారా వివిధ సమయాలలో క్రమం తప్పకుండా వారం రోజులపాటు ఆదేశాలను పాటించాల్సిందిగా. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు.