సంగారెడ్డిలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, మే 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం వాసవి మహా సంస్థాన్ కమిటీ అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పాండయ్య, కార్యదర్శి రాజు, కార్యనిర్వాక కార్యదర్శి విద్యాసాగర్, యువజన సంఘం అధ్యక్షుడు తోపాజి హరీష్, సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now