Site icon PRASHNA AYUDHAM

వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం 

IMG 20250626 WA0529

వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 26

 

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల కేంద్రంలో గల వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి

ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ సెక్రెటరీ

విష్ణు నాథన్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్ లు హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు.

శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శేణిశెట్టి రాజమౌళి. డైరెక్టర్లుగా.

ఏ రాజేశం. భుక్య శాంతి సత్యనారాయణ, టి దేవయ్య లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ శ్రీ వీరహనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతన మైనదనీ, మహిమలు గలదని అన్నారు. నాకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన స్వామివారికి ఎల్లవేళలా రుణపడి ఉంటాను అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు నిజాయితీగా స్వమీ వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని మీకు ఈ అవకాశం దొరకడం చాలా గొప్ప విషయమని స్వామి వారి కరుణతోనే మీకు ఈ పదవులు వచ్చాయని, దాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కోరికలు కోరుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని, ఆలయ దర్శనం చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, లోయపల్లి నర్సింగరావు, చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి,మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version