వీర జవాన్ తిక్క సందీప్‌కు ఘన నివాళి – రాచకొండ సీపీ, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నాయకులు హాజరు

**వీర జవాన్ తిక్క సందీప్‌కు ఘన నివాళి – రాచకొండ సీపీ, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నాయకులు హాజరు**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 9

IMG 20250509 WA2196

నక్సలైట్ల కాల్పుల్లో వీర మరణం పొందిన మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్‌కు చెందిన రాచకొండ ఏఆర్ జవాన్ తిక్క సందీప్ భౌతిక కాయానికి రాచకొండ పోలీస్ కమిషనర్ (సీపీ) నివాళులర్పించారు.

సీపీతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి మరియు మేడ్చల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సందీప్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలి అర్పించారు.

అంతేకాకుండా, వారు సందీప్ కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇదే సందర్భంగా రాచకొండ సీపీ, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి భౌతిక కాయాన్ని కూడా సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సీపి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment