రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి నష్ట పరిహారం చెల్లించాలి..వెంకట రమణ రెడ్డిఎమ్మెల్యే

రాళ్ళ వానకి నష్టపోయిన పంటకి నష్ట పరిహారం చెల్లించాలి

– అధికారులు పంట నష్టం పై నివేదిక ఇవ్వాలి

– కళ్ళములో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలి

– తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలి 

– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

– కామారెడ్డి

రాత్రి కురిసిన అకాల వడగళ్ల వాన కారణంగా నష్టపోయిన పంటను, కళ్ళల్లో తడిసిన వడ్లను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి బుధవారం కామారెడ్డి మండలంలోని అడ్లూర్, చిన్న మల్లారెడ్డి, రాజంపేట మండలం తలమడ్ల గ్రామాల్లో వడ్ల కళ్ళల వద్దకి వెళ్లి రైతులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వాన వల్ల ఇంకా కోత కానీ వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని, నష్టపోయిన పంటకి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్టం పై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనీ కోరారు. కళ్ళములో తడిసిన సంచులను రైస్ మిల్లర్లు దించుకోవాలనీ విజ్ఞప్తి చేశారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా కాంట పూర్తి చేయాలనీ అన్నారు. తూకం వేసిన వడ్లు సాధ్యమైనంత తొందర రైస్ మిల్లులకు తరలించాలనీ అన్నారు.

Join WhatsApp

Join Now