Site icon PRASHNA AYUDHAM

విశాఖలో విజయం వైసీపీదే!

IMG 20240816 WA0029

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికకు మంగళవారం చివరి తేదీ కావడంతో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. కాగా బుధ‌వారం నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండటంతో.. స్వతంత్య్ర‌ అభ్యర్థిగా ఉన్న షఫీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పోటీలో ఎవరు లేకపోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్‌ అధికారి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు..

Exit mobile version