కామారెడ్డి లో విద్యార్థుల ఆసుపత్రి ట్రైనింగ్ – ప్రభుత్వ ఆసుపత్రి లో శిక్షణ ప్రారంభం
కామారెడ్డి జిల్లా టౌన్ ప్రశ్న ఆయుధం నవంబర్ 01:
కామారెడ్డి జిల్లా కేద్రంలోని జూనియర్ కళాశాల ఎం.ల్.టీ, ఇతర కోర్స్ విద్యార్థిని, విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో శిక్షణకు శుక్రవారం నుండి పంపడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కామారెడ్డి ఒకేషనల్ విద్యార్థులు శుక్రవారం నుంచి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో ఆన్ జాబ్ ట్రైనింగ్ కొరకు వెళ్ళుచున్నా విద్యార్థులందరికీ కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి ఓ జె టీ గురించి, ఆసుపత్రిలో డిసిప్లిన్ గా ఉండాలని, శిక్షణ తరగతులకు ప్రతిరోజు హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు పద్మ, యోగితా తదితరులు పాల్గొన్నారు.