*అమెరికా లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని అభినందించిన వొడితల ప్రణవ్*
*అమెరికా చదువుకి రాష్ట్రంలో నలుగురు
హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఒక విద్యార్థి*
*ప్రతిభ గల విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం*
*2 సంవత్సరాలకు 55లక్షలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం*
*ఉన్నత విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు సేవాలందించాలి*
*కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల*
*జమ్మికుంట/వీణవంక ప్రశ్న ఆయుధం ఆగస్టు4*
క్రమశిక్షణ తో పట్టుదల తో కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని అందరికి స్ఫూర్తి అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు వొడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రిక కు అమెరికాలో ఉచితంగా మాస్టర్స్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు అమెరికాలోని అబరాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రెండేళ్లకు గాను 55లక్షల 50 వేలు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటించరాని తెలిపారు అమెరికా దేశంలో ఉన్నత చదువులు చదవడానికి రాష్ట్రంలోని నలుగురు విద్యార్థులని ఎంపిక చేయగా హుజురాబాద్ నియోజకవర్గం లో మూల పావని ఎంపిక కావడం నియోజకవర్గానికి గర్వకారణం అని ప్రతిభ ఉన్న విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అమెరికాలో ఉన్నత చదువు చదవడానికి విద్యార్థినికి 55 లక్షల ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని పేద విద్యార్థుల పట్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు మోడల్ స్కూల్ లో చదివి అమెరికాలో సీటు పొందిన విద్యార్థి ఈ ప్రాంత విద్యార్థులకు ఆదర్శం అన్నారు అమెరికాలో ఉంటున్నానని అధర్యపడవద్దని ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలని విద్యార్థినికి ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అమెరికాలో ఉన్నద విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు తాను నేర్చుకున్న విద్యను ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు విద్యార్థిని మూల పావని మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన కూడా ఉన్నత విద్య కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి స్థానిక నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ కి కృతజ్ఞతలు తెలిపారు