ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

*ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి*

*హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి*

*జమ్మికుంట మే 10 ప్రశ్న ఆయుధం*

ఎండాకాలంలో ఎండ తీవ్రతకు కూలీలు వడదెబ్బకు గురి కావడం జరుగుతుందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సూచనలు చేశారు శనివారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గంగారం చెరువు వద్ద పనులు చేసిన ఉపాధి హామీ కూలీలకు నాగంపేట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి వడదెబ్బ పై ఆరోగ్య అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమములో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు వ్యవసాయ కూలీలకు వడ దెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరించారు. వడ దెబ్బ నివారణకై ప్రజలు, వివిధ రకాల పనులు చేసే కూలీలు, ప్రయాణికులు అందరూ రోజుకి 15 గ్లాసుల మంచి నీళ్లు త్రాగాలని, నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మ రసం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, లేత వర్ణం తెలికైనా తెల్లని కాటన్ దుస్తువులు ధరించాలని, ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండ లేని సమయంలో పనులు చేసుకోవాలని సూచించారు. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, శుభ్రంగా రెండు పూటలా స్నానం చేయాలని, మాంసం, మందు, మత్తు పదార్తలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఎండ వేడిమికి డి హై డ్రేషన్ కాకుండా ఉండడానికి ఓ ఆర్ ఎస్ ద్రావణాన్ని త్రాగాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలందరికి ఓ ఆర్ ఎస్ పాకెట్స్ ని పంపిణీ చేసినారు.

ఈ కార్యక్రమములో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఏఎన్ఎం తిరుమల, ఆశా కార్యకర్త సరిత ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment