మంత్రి సీతక్క పర్యటన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 15
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు) లో వనమహోత్సవం కార్యక్రమం ద్వారా జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క.తొలి పర్యటనలో భాగంగా వనమోత్సవ కార్యక్రమం లో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రజా ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.