*వరంగల్ నేతలపై: కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..*
వరంగల్ పంచాయితీని తెంపే బాధ్యతను మంత్రి పొంగులేటికి ఇచ్చిన అధిష్టానం జిల్లాలో కొండా వర్గీయులు రెచ్చిపోతున్నారని మంత్రి కొండా సురేఖపై వరంగల్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ గొడవలకు ముగింపు పలికేందుకు అధిష్టానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు చిన్న చిన్న విషయాలకు ఇలా గొడవలు పడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కూదుర్చాలని మంత్రి పొంగులేటికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.