Site icon PRASHNA AYUDHAM

ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతున్నాం..

IMG 20241112 WA0039

ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతున్నాం..

వేమన ప్రశ్న అందరికీ వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడికి పోతున్నాము అని.దానికి సమాధానం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతున్నాం. ఎవరైతే ఇప్పుడు జన్మించిన జన్మ కన్నా ధర్మంగా జీవించి పరమార్ధ జీవితం గడుపుతారో వారు వచ్చిన లోకాల కన్నా ఇంకా మంచి లోకాలకు వెళతారు.తిరిగిరాని లోకము అంటే వైకుంఠము, సత్య లోకము, కైలాసం. ఈ లోకాలలోకి వెళితే అనంతకాలము అక్కడ ఉండవచ్చు.అక్కడ ఏమన్నా అజ్ఞానంలో పడితే తిరిగి ఈ లోకాలలో జన్మిస్తారు. లేదా వారి వల్ల ఏదైనా లోక కళ్యాణం జరగాలంటే తిరిగి ఈ లోకంలో భగవంతుడు చేత ఇక్కడికి పంపబడతారు. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఆయన మోక్షాన్ని అడిగారు. విష్ణుమూర్తిని ఆయన ప్రసాదించారు.
తిరిగి ఈ భూలోకంలో వ్యాస తీర్ధులుగా, మరియు రాఘవేంద్ర స్వామిగా జన్మించారు .ఈ జన్మకి కారణం లోక కళ్యాణమే.
వేమన కు పరమేశ్వరుడే ఆయనకు గురువుగా బోధించారు. ఇక్కడ ఆయన చెప్పేది రాజయోగం గురించి.క్రియాయోగంలో ఆనా పానా సతీ అని, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారు. ఇది క్రియాయోగం అని కూడా అంటారు పత్రీజీ‌.
కానీ హఠాయోగ సాధనలో శ్వాసను బంధించి సాధన చేయడం ద్వారా మనసు అదుపులోకి వస్తుంది కానీ, తిరిగి ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు మరల మనం అజ్ఞానంలో పడిపోతాము.
కానీ రాజ యోగ సాధనలో మనసుని బంధించి సాధన చేస్తాము ఈ సాధన ద్వారా మనసు అనేది పూర్తిగా నిగ్రహించబడుతుంది.
కారణం రాజయోగ సాధనలో వైరాగ్యభావం తో మనసు అదుపులో ఉంటుంది. కాబట్టి వైరాగ్యంలో మనసుకు తావు ఉండదు.ఇక్కడ సాధన అంటేనే నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటే ఒకానొక సమయంలో పూర్తిగా మీకు మనసుపై పట్టు దొరుకుతుంది. అప్పటివరకు సాధన చేస్తూనే ఉండాలి.మనస్సు మీ అదుపులోకి వచ్చినప్పుడు మీకు సమస్తము మీ ఆధీనంలోకి వస్తుంది.
అంటే ప్రకృతి మీ ఆధీనంలోకి వస్తుంది అని. వైరాగ్య భావంతో చేసే సాధన ద్వారా మనసు పరమాత్మలో లీనమైనప్పుడు,
జీవాత్మ మరియు పరమాత్మ ఒకటైపోయినప్పుడు ఇక ఈ ప్రపంచంలో మన ఉనికి అనేది ఉండదు. అదే సమాధి స్థితి..

Exit mobile version