ముఖ్యమంత్రి మాటలను ఖండిస్తున్నాం.
– సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీ మరిచారా?
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామరెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా 26వ రోజు ప్రభుత్వం తమ సేవలను గుర్తించి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ నుంచి ర్యాలీగా వెళ్లి నిజం సాగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి అనంతరం రోడ్డుపై బేటాయించారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ సీఎం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని స్కీమ్ అని అన్న మాటలను ఖండించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ గత ప్రభుత్వంలో సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం ,మంత్రులు మర్చిపోయి క్రమబద్ధీకరణ సాధ్యం కాదని చెప్పడం విడ్డూరమన్నారు. పంజాబ్, హర్యానా, సిక్కిం,జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి ఇతర రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులర్ చేశారని, పే స్కెల్ అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు అని ప్రశ్నించారు.