*రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించిన మా భూమిని మాకు ఇప్పించండి*
*రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుండి మాకు ప్రాణ హాని ఉంది*
*జిల్లా కలెక్టర్కు జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కు ఫిర్యాదు చేసిన బాధితులు*
*జమ్మికుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*
రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిని ఆక్రమించారని జిల్లా కలెక్టర్ కి జిల్లా కమీషనర్ ఆఫ్ పోలీస్ కి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి కి చెందిన రాచమల్ల నిర్మల భర్త మహేందర్ ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మన్సిపాలిటీ పరిధిలోని ధర్మారం (పి.బి.) రెవెనూ పరిధిలోని రామన్నపల్లి గ్రామములో కొనుగోలు చేసిన పర్వేనం. 405/సి లోని భూమి విస్తీర్ణం. 645.60 చ.గజాల డాక్యుమెంటనం. 1414/2020 గల భూమిని కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తు, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కు పోలీస్ కమిషనర్ కు విన్నవించుకున్నారు
వృత్తిరీత్యా వృత్తి చాకలి పని ఇండ్లలల్లో పని చేసుకుంటు భర్త ఇస్త్రీ పని చేసుకుంటు కట్టెలు కొంటుకుంటు జీవనం సాగిస్తున్నామని వారికి ఇద్దరు పిల్లలు కలరని తెలిపారు వారు రూపాయి రూపాయి కుడపెట్టుకొని గత ఐదు సంవత్సరాల క్రితం జమ్మికుంట మున్సిపాలిటి పరిధిలోని రామన్నపల్లి గ్రామములోని సర్వేనం. 405/సెలో 645.60 చ.గజాల భూమిని కొలకాని రవి తండ్రి మంకయ్య వద్ద నుండి మేడిపల్లి మొగిలి అనే వ్యక్తి మద్యవర్తిగా ఉండి భూమిని కొనుగోలు చేయించాలని ఇట్టి డాక్యుమెంట్నం. 1414/2020, తేది: 28.02.2020 రోజున హుజురాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయములో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని సర్వేనం. 405/సిలో (కొలకాని రవి) అమ్మిన భూమి పోను కొలకాని రవికి మేడిపల్లి వెంకటేశ్వర్లుకు ఇద్దరికి భూమి కలదని ఇట్టి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయిన దేశిని కోటేశ్వర్, ఆరుకాల విరేశలింగం ఆరుకాల కార్తీక్ వీరికి అమ్మినారు. ఇట్టి భూమిని చదును చేసే క్రమములో మా భూమిని హద్దులను భూమికి హద్దుల నిర్మాణం కొరకు వేసుకున్న ఇటుకలను మొత్తం బ్లేడ్ ట్రాక్టర్తో చెదరగొట్టి భూమిని కబ్జా చేసి, హద్దులను లేకుండా చేసినారు ఇట్టి విషయము భూమి అమ్మిన యాజమాని కొలకాని రవిని మేడిపల్లి మొగిలి (మున్సిపాలిటి బిల్కలెక్టర్) వెంకటేశ్లర్లు భూమి కొన్నవారు దేశిని కోటేశ్వర్, ఆరుకాల విరేశలింగం ఆరుకాల కార్తీక్ లను రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రకారం మా భూమిని కూడా కబ్జా చేసి చదును చేసినారని తను తన భర్త ప్రాధేయపడడం జరిగిందని ముమ్మలను కనకరించకుండా మేము రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామని ప్లాట్స్ పెట్టి అమ్ముకుంటాము అని, మేము ఇచ్చిన కాడ భూమి తీసుకుకోవాలని బెదిరించి ఒప్పందం వ్రాసినారు మా ప్రమేయం లేకుండానే పట్టా చేసుకున్నారని వారు ఒప్పందం ప్రకారం ఉండకుండా దిక్కరించి భూమి చుట్టూ గోడ నిర్మాణం చేసుకొని అక్రమగా లేవుట్-ఆవుట్ ప్లాన్ మ్యాప్ తీసి ప్లాట్స్ పెట్టి అమ్ముతున్నారని భార్యాభర్తలం ఇద్ధరము అరుకాల విరేశలింగం, దేశిని కోటేశ్వర్, ఆరుకాల కార్తీక్, మేడిపల్లి మొగిలి, కొలకాని రవి మేడిపల్లి వెంకటేశ్వర్లు మమ్ముల్ని ఎల్లమ్మ గుడికాడి పిలిపించి, నువ్వు కోర్టుకు వెళ్ళిన, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, కమీషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరకు వెళ్ళిన, జిల్లా స్థాయిలో ఏ అధికారి దగ్గరకు వెళ్లిన నీ తో ఏమి కాదు. నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరించినారని మేము తలుచుకుంటే నిన్ను చంపేయగలమని బెదిరింపులకు పాల్పడినారని ఆరోపించారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నానా బూతులు అనడం జరిగిందని వారి నుండి మాకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు పేర్కొన్నారు తాముక్కున్న భూమిని తమకు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు