ప్రజాయుద్ధంలో కగార్ ను ఓడిస్తాం
జన్ అదాలత్ లో ఆ ముగ్గురికి శిక్ష తప్పలేదు
మావోయిస్టు పార్టీ గంగలూరు ఏరియా కమిటీ
(, హైదరాబాద్ )
దండకారణ్యంలో జా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆదివాసీలను మావోయిస్టు పార్టీ గంగలూరు ఏరియా కమిటీ హెచ్చరించింది. ఇటీవల బీజాపూర్ జిల్లా పెద్ద కోర్మా లోని ముగ్గురి హత్యకు పోలీసు అధికారి జితేంద్ర యాదవ్, గద్దర్ దినేష్, మనీష్, సంతోష్ బాధ్యులని ఓ ప్రకటనలో వివరించింది. మావోయిస్టు పార్టీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, బీజాపూర్ జిల్లా పెద్ద కోర్మా గ్రామంలో గద్దర్ దినేష్ కుటుంబానికి గతంలో 5-6 సార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు, కానీ మెరుగు పడలేదు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్, గద్దర్ మోడియం దినేష్ నాయకత్వంలో, కొంతమంది విద్యార్థులను, పిల్లలను రహస్య సైనికులుగా, చిన్న బృందాలుగా చేసి, సమాచారం కోసం గ్రామంలో ఉంచారని. తాము వారిని ఇప్పటికే పట్టుకున్నామన్నారు. జన్ అదాలత్లో విచారణ తర్వాత, మోడియం జంగు, మోడియం సోమల్, మాద్వి అనిల్లను చంపారని వివరించారు. గతంలో చాలాసార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా, కానీ ఇప్పటికీ వీరికి అర్థం కాలేదని, పీఎల్జీఏ పై దాడి చేయాలని పోలీసులకు సమాచారం ఇచ్చారని, అందుకే వారిని పట్టుకుని చంపారని, వీరి హత్యకు ఎస్పీ జితేంద్ర యాదవ్, గద్దర్ దినేష్, మనీష్, సంతోష్ బాధ్యులుగా తేల్చారు. ఇక పై ప్రజావ్యతిరేక కార్యకలపాలకు పాల్పడినా.. ఇలాంటివి ఎవరైనా చేస్తే, ఇదే శిక్ష పడుతుందని గంగలూరు ఏరియా కమిటీ హెచ్చరించింది. మోడియం జుగుకు రూ. 25 వేలు ఇచ్చారు, దినేష్ జుగుకు కొంత డబ్బు బ్యాంకులో ఉంచుతానని వాగ్దానం చేశాడు, మోడియం సోమల్కు రెండు నెలలు శిక్షణ తరువాత రూ. 10 వేలు ఇచ్చారు. ఆ తరువాత అతడిని చిన్న బృందంలో ఉంచాడు, మాద్వి అనిల్ కూడా ఈ బృందంలో సభ్యుడు, అతనితో పాటు 10 మంది సభ్యులు ఉన్నారు, వీరిని కూడా పట్టుకుని జన్ అదాలత్లో కౌన్సెలింగ్ ఇచ్చినట్టు గంగలూరు ఏరియా కమిటీ స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ కాన్ఫిడెన్షియల్ ద్వారా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నామని, సైనిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ వద్దు, మీ సొంత జీవితం గడపడం గురించి ఆలోచించండి, ప్రజల హక్కులను లాక్కుంటున్న వారు, దేశ సంపదను భూస్వామ్యానికి, బ్రోకర్లకు, అవినీతి రాజ్య పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు అప్పగిస్తున్న శక్తులు , హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతాం, ప్రజా యుద్ధంలో కగార్ ఓడిస్తాం, అని గంగలూరు ఏరియా కమిటీ తెలిపింది.