మిషన్ భగీరథ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తాం :కొత్వల

IMG 20241011 WA3163

మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తాం

   —రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల

 

మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికై కృషి చేస్తామని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, డీసీఎంస్చై ర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. 

 

మిషన్ భగీరథకు నూతనంగా ఏర్పడిన ఐ ఎన్ టి యు సి  కార్మిక విభాగం కార్మికులు శుక్రవారం పాత పాల్వంచలో కొత్వాల స్వగృహానికి వెళ్లి తమ సమస్యలు ఏకరువుపెట్టారు. అనంతరం కొత్వాల ను శాలువా, బొకేలతో సన్మానించారు. 

 

ఈ సందర్భంగా కొత్వాలమాట్లాడుతూ కంపెనీలు కార్మికులకు సకాలంలో జీతాలు అందించాలని, పిఎఫ్ ,  ఈఎస్ఐ లు కట్టెల చర్యలు తీసుకునేలా కృషి చేస్తామన్నారు. వారికి ఉద్యోగ భద్రత కలిగేలా కంపెనీలు సహకరించాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారికి తగు న్యాయం జరిగేలా కృషి చేస్తామని *కొత్వాల* అన్నారు. 

 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, మిషన్ భగీరథ  ఐ ఎన్ టి యు సి విభాగం జిల్లా అధ్యక్షులు ,రెడ్డి ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్, పాండురంగారావు, డి ప్రభాకర్, టీ అనిల్ కుమార్, ఎస్.కె  అక్బర్, యు సాయి ప్రసాద్, డి శాంతన్, కాంగ్రెస్ నాయకులు వై వెంకటేశ్వర్లు, బాలినేని నాగేశ్వరరావు, కాపర్తి వెంకటాచారి, కందుకూరి రాము, యర్రంశెట్టి మధు, పైడిపల్లి మహేష్, శాంతివర్ధన్, దానిమేలు, నాగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now