నేను విగ్రహాన్ని పూజిస్తే దాన్ని ధ్వంసం చేయగలవేమో,
సూర్యుడిని పూజిస్తా ధ్వంసం చేయగలవా!
చంద్రుడిని పూజిస్తాం ధ్వంసం చేయగాలవా!
అగ్నిని పూజిస్తాం ధ్వంసం చేయగళవా!
నీటిని, భూమిని, గాలిని, చెట్లని, పుట్లని, పర్వతాలను పూజిస్తాం ధ్వంసం చేయగలవా!
నువ్వు సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఎందరో ముష్కరులు వచ్చారు, ఎందరో ఆంగ్లేయులు వచ్చారు. ఎన్నో దేశాలను అక్రమించారు. కాదన్నవారిని ఊచకొత కోశారు. ఆయా దశాబ్దాలలో వారివారి సంస్కృతులు మార్చారు.
ఎందరు వచ్చి ఎన్ని దాడులు చేసినా, ఎంతో విలువైన సంపదలు దోచుకెళ్లారు. మతాలు మార్చారు. స్త్రీలని చెరిచారు. వెన్నుపోటు దారులతో కలిసి వీరులను చంపారు. కాదన్న చిన్నా పెద్ద, అడ మగ తేడా లేకుండా తెగనరికారు. అయినా నేటికీ ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచింది ఈ దేశం. నా భారతదేశం..
మీలాంటివారు ఎందరైనా రావచ్చు గాక! మీఎంగిలి మెతుకులు ఎందరైనా తినొచ్చుగాక! వెన్నుపోటు దారులు మీతో చేయి కలిపి మీకు వత్తాసు పలకవచ్చు గాక! ఎవరెంతగా యత్నించిన భూమండలం ఉన్నంతకాలం, సూర్య చంద్రాది గ్రహాలు ఉన్నంతకాలం సనాతనధర్మం ఉండే తీరుతుంది. ఏదో ఒకమూల ఎవరో ఒకరు పంచభూతాలను పూజిస్తునే ఉంటారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటారు. ఇతర దేశాలను అక్రమించినట్లు ఆక్రమించడం మీ తరం కాదు. మంటల్లో పడిన శలభాలు అయిపోతారు. జైహింద్.
✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩