రాబోయేది బీఆర్ఎస్ రాజ్యమే..

రాబోయేది బీఆర్ఎస్ రాజ్యమే.

ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి.

కేటీఆర్ కు దసరా శుభాకాంక్షలు దగ్గర ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి.

IMG 20241013 WA0048

భవిష్యత్తులో తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ రాజ్యమేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. విజయదశమి దసరా పండుగ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారక రామారావు (కేటీఆర్) ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి శాలువా పూల బొకేతో సన్మానించారు. కేటీఆర్ ఎంతో ఆత్మీయంగా పలకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిణామాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకు ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని ప్రజలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాల వైపు ఉద్యమాలు మల్చాలని ఈ సందర్భంగా సూచించినట్లు తెలిపారు. ఈ విజయదశమితో అందరి దశ మారాలని సమాజంలో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.. 

Join WhatsApp

Join Now