గత నాలుగు నెలల్లో పదిమంది మృత్యువాత RCO పట్టించుకోకపోవడనికి కారణం ఏమిటి?

సరైన విచారణ చేయకుండా విద్యార్థిని మందలించిన ప్రిన్సిపల్ వార్డెన్ సిబ్బంది. ప్రాధేయపడిన హాస్టల్ నుంచి ఇంటికి పంపించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ప్రిన్సిపల్ వార్డెన్ ని సస్పెండ్ చేయాలి

PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేల శివ ప్రశాంత్

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థి నీతో మాట్లాడుతున్న సందర్భంగా PDSU భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ.

దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేయడం చాలా దారుణమైన విషయమని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపల్ వార్డెన్ కారణమని ఆయన అన్నారు.
ఏకలవే గురుకుల పాఠశాలలో గత నాలుగు నెలల నుండి అనేక సమస్యలు తలెత్తినప్పటికీ సంబంధిత ఆర్ సి ఓ పట్టించుకోకుండా టిప్ టాప్ చేస్తూ అధికారులకు రాంగ్ గైడెన్స్ ఇస్తున్న ఆర్సీఓపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని ప్రాణాలతో చేలగాటం వాడుతున్న సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గత నాలుగు నెలల నుండి అనేక సమస్యలు తలెత్తినప్పుడు మంచినీరు మరియు భోజన సమస్య సమస్యల పరిష్కారం చేయకుండా. ఆకుతాయలు. హాస్టల్లోకి చొరబడ్డారని ఈ విద్యార్థుల కోసమే వచ్చారనే కారణంతో విద్యార్థిని హాస్టల్ నుండి పంపించడం వల్ల మనోవేదనకు విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్ ఐసీయూలో విద్యార్థిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ ని వార్డెన్ ని ప్రాధేయపడినప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా వివరించడం వల్ల ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఐ టి డి పి ఓ పి డి ఎస్ యు నాయకులు ఫోన్ చేసి అప్పుడు రెస్పాండ్ అయి సూపర్డెంట్ రామకృష్ణ తో మాట్లాడి మెరుగైన వైద్యం చేపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
గురుకులాల పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా గురుకులాలలోని విద్యార్థినుల మరణ మృదంగ హేళ కనిపిస్తుందని ఆయన అన్నారు.సుమారు పదిమంది ముక్కుపచ్చలారని విద్యార్థినులు మృత్యువాత పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కారణాలు ఏమైనా ఉన్నతాధికారులు తమ పరిధిలోని గురుకులాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల పట్ల సహృదయంతో వారిని అర్థం చేసుకొని అక్కడ పనిచేసే బోధన బోధనేతర సిబ్బంది ద్వారా వారి మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అధ్యాపకులతో మంచి సత్సబంధాలను కలిగి ఉండే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ ఉన్నతాధికారులపై ఉంటుంది ఆయన గుర్తు చేశారు. భద్రాచలం నియోజకవర్గం లో గత నాలుగు నెలల నుండి ఏదో ఒక గురుకులంలో సమస్యలు తలెత్తిన జిల్లా అధికారి ఆర్ సి ఓ పై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఆయన అన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులపై సిబ్బందిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన కోరారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) భద్రాచలం డివిజన్ కమిటీ 9849599748.

Join WhatsApp

Join Now