Site icon PRASHNA AYUDHAM

ఉన్న బస్సు షెల్టర్ ఎక్కడ లేని టాయిలెట్స్ నిర్మాణం ఎప్పుడు మాదిగ ఐక్యవేదిక

IMG 20250103 WA0190

ప్రశ్న ఆయుధం జనవరి 3 సుజాత నగర్ మండల ప్రతినిధి ఎస్.కె. అజ్జు

సుజాతనగర్ మండల కేంద్రంలో బస్సు షెల్టర్ తో పాటు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం నాడు మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుజాతనగర్ ఎమ్మార్వో మండల ఎండీవో గ్రామ సెక్రెటరీ అధికారులకు వినతి పత్రం అందజేశారుమ సుజాతనగర్ మండల కేంద్రంగా ఏర్పాటైననుండి జన సమూహ రద్దీ ఎక్కువైందని, అనేక అవసరాల రిత్యా మండల పరిధిలో ఉన్న 20 గ్రామ పంచాయతీల నుండి ప్రజలు కేంద్రానికి వస్తున్నారని, అంతేకాక జూలూరుపాడు చంద్రుగొండ చుంచుపల్లి మండలాల నుండి కూడా వస్తున్నారని, అందువలన కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ లేక మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోవాలని గతంలో సుజాతనగర్ మండల కేంద్రంలో బస్సు షెల్టర్ ఉండేదని అది ఇప్పుడు ఎక్కడ ఉందో కనిపించడం లేదని, ప్రయాణికుల ఇబ్బందులు పరిగణం లోకి తీసుకుని కబ్జాకు గురైన బస్ షెల్టర్ ను పునర్నిర్మించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా మండల మాదిగ ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్ మాట్లాడుతూ ,ఇప్పటికే పలుమార్లు ఇట్టి విషయంపై నిరసన తెలిపామని ఇప్పుడు అధికారులకు వినతి పత్రాలు అందించామని, వారు స్పందించి సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారని అన్నారు పరిష్కారం చెయ్యకపోతే సుజాతనగర్ మండల కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష చేపడతామని అన్నారు దీని విషయంపై అన్ని వర్గాల ప్రజలు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న సిరిగిరి మురళి సహాయ కార్యదర్శి కేసు పాక వెంకటేశ్వర్లు ప్రత్యేక ఆహ్వానితులు మురిపిటి నాగేష్ మండల నాయకులు మురిపిటి గణేష్ రంగపురి వెంకటేశ్వర్లు, మురిపిటి కన్నయ్య ,గుండేటి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version