ఝాన్సీరెడ్డి కి టీపీసీసీ పదవి పై గాంధీభవన్లో చర్చ.
అమెరికా పౌరురాలికి పదవి ఎలా ఇచ్చారంటూ గుసగుసలు…
భారత రాజ్యాంగ ప్రకారం దేశ రాజకీయాల్లో విదేశీయుల జోక్యం నిషేధం…
కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో అనూహ్యంగా విదేశీ పౌరురాలికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పదవి దక్కడం పై గాంధీభవన్లో కాంగ్రెస్ నాయకులు మధ్య చర్చ…
పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పని చేసిన వారిని కాదని ఎన్నికల ముందు అమెరికా నుండి వచ్చిన వ్యక్తికి పదవి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం…
ఝాన్సీరెడ్డి కనీసం భారత పౌరురాలు కూడా కాదని ఇటువంటి వ్యక్తులకు పదవులు ఇవ్వడం ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశం ఇచ్చినట్టే అంటూ చర్చ… మరో చిన్నమనేని రమేష్ వుదంతం అని విశ్లేషకులు భావిస్తున్నారు