*RCB తో ఢీకొట్టేది ఎవరు ❓*
*హైదరాబాద్: మే 01*
ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడి యం వేదికగా జరగనున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. కాగా ఐపీఎల్ ఫైనల్లో ఆర్సి బీ తో తలపడేది ఎవరో ఈరోజు తేలిపోనుంది, అయితే పంజాబ్ జట్టు స్టార్ స్పిన్నర్ యు జ్వేంద్ర చాహల్,ముంబైతో మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం.
గాయం కారణంగా క్వాలిఫయర్-1తో పాటు లీగ్ దశలో రెండు మ్యాచ్లకు దూరమైన ఈ లెగ్ స్పిన్నర్ చేరిక పంజాబ్ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ఈ సీజన్లో చాహల్ 14 వికెట్లు పడగొట్టాడు.
ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లిస్, నేహాల్ వధేరా, స్టాయినిస్, శశాంక్ సింగ్లతో పంజాబ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బౌలింగ్లో సూపర్ ఫామ్లో ఉన్న అర్ష్దీప్ సింగ్తోడు జేమీసన్, వైశాఖ్, అజ్మతుల్లా లు రాణిస్తే పంజాబ్కు తిరుగుఉండదు.
ఇదిలా ఉంటే.. క్వాలిఫ యర్ 2లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు లీగ్ నుంచి నిష్ర్కమిస్తుంది. ఎలిమినేటర్లో అదిరిపోయే ప్రదర్శనతో జోరు మీదున్న ముంబైను క్వాలిఫయర్1లో ఘోర పరాభవంతో ఆత్మ విశ్వా సం దెబ్బతిన్న పంజాబ్ కింగ్స్ ఎంత మేరకు అడ్డు కుంటుందో చూడాల్సిందే.
అయితే.. ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.