Site icon PRASHNA AYUDHAM

ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు..?

IMG 20250627 085002

*ఆషాడం* అంటే అందరికీ ఇష్టమైనా, కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు♪. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్త గారు ఒకేచోట ఉండకూడదు♪. ఒకరికి ఒకరు ఎదురు పడకూడదని చెబుతూ ఉంటారు♪. అంతేకాకుండా, సాగు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటారు♪. కాబట్టి, కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశ్యంతో కూడా ఎడబాటుగా ఉంచుతారు♪.

*ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు♪? దీనివల్ల కలిగే అనర్థం ఏమిటి♪? అసలు కలిసి ఉంటే ఏమవుతుంది♪?*

*ఆషాడ మాసం కాదిది, – నవదంపతుల సరస శృంగారాల సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల, విరహాల ఆరూఢమాసం*_

అంటూ ఓ కవి దీనిని వర్ణించాడు♪.

ఆషాడంలో కొత్తగా పెళ్లైన జంటలకు ఎడబాటు తప్పదు♪. అత్తా-అల్లుడు ఎదురు పడకూడదనే ఆచారం ఉంది♪. అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలసి ఉండకూడదని అంటారు♪. దీనివెనుక కూడా ఒక అర్థం ఉంది♪.

పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం♪. సంపాదన మాట అటుంచి, తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని, కొత్త వలపు మోజులోపడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని ఈ నిబంధన పెట్టారు♪.

అంతే కాదు, ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి♪. చల్లని వాతావరణంవల్ల బ్యాక్టీరియా, వైరస్ లు అంటువ్యాధులుగా బాగా ప్రబలుతాయి♪. ఇలాంటి సమయంలో కొత్త పెళ్ళికూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డమీద వాటి ప్రభావం ఉంటుంది అనేది శాస్త్రీయ నమ్మకం♪. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం♪. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి♪. కావున ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండడమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు♪.

ఈ ఆషాఢాన్ని అనారోగ్యమాసంగా పేర్కొంటారు♪. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది♪. కాలువలలోనూ, నదులలోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది♪. మలినాలతో కూడిన నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది♪. ఇవన్నీ గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులోని పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది.అలాగే, ఆషాడం తరువాత వచ్చే శ్రావణమాసంలో వ్రతాలు, నోములు జరుగుతాయి♪. ఈ నెలలో దాదాపు అన్నీ మంచిరోజులే వుంటాయి♪. ఆ శుభ ఘడియలలో గర్భధారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం.జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాఢంలో గర్భం దాల్చితే 9 నెలలకు అంటే చైత్రానికి పూర్తవుతుంది♪. ఆ సమయంలో ఎండకు పుట్టిన పిల్లలు, బాలింతలు తట్డుకోలేరని ఈ నియమం పెట్టారు♪. అలాగే ఒక నెల వియోగం తరువాత కలుసుకుంటే, అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారు అని కూడా అంటారు♪.

పూర్వ కాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది♪. కష్టపడి పని చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే, వ్యవసాయ పనులు జరుగవు♪. వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడి పోవాల్సిందే♪.

అందుకే కొత్త కోడలు పుట్టింటిలో ఉండాలి♪. అల్లుడు అత్తారింటివైపు చూడకూడదని నియమం పెట్టారు.

Exit mobile version