Site icon PRASHNA AYUDHAM

ఏంది గురూ….. ఇలా ఉందా సమాజం….ఇదేం పాడు పని తల్లి…..భర్త వద్దు….ప్రియురాలు ముద్దు…..అంటూ…వెళ్ళిపోయింది ..!

IMG 20241225 WA0032

*ఏంది గురూ….. ఇలా ఉందా సమాజం….ఇదేం పాడు పని తల్లి…..భర్త వద్దు….ప్రియురాలు ముద్దు…..అంటూ…వెళ్ళిపోయింది …ఇదో లెస్బియన్ ప్రేమకథ.. భర్తను వదిలేసి మహిళతో పారిపోయిన 7 నెలల గర్భవతి*

యువతీ యువకులు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే.

అయితే ఇదో పెద్ద ట్విస్ట్…. మహిళను ప్రేమించిన మరో మహిళ.. పెళ్లి అయి భర్తతో సంసారం చేసి.. 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మహిళతో కలిసి పారిపోయింది. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఆ లెస్బియన్ ప్రేమ కథ ఇప్పుడు తెగ సంచలనంగా మారింది. ఒక యువతి మరో యువతిని ప్రేమించింది. ఈ విషయం కాస్తా ఆ యువతి ఇంట్లో తెలిసింది. అది విని వారు మొదట షాక్ అయ్యారు. నలుగురికీ తెలిస్తే తమ పరువు పోతుందని భావించి.. ఎలాగైనా వారి ప్రేమను విడదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తిని చూసి తమ కుమార్తెను ఇచ్చి 2022 అక్టోబరులో పెళ్లి చేశారు. ఆ తర్వాత అంతా సక్రమంగానే సాగింది. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అని తెలిసింది. అయితే ఆమె డెలివరీ తేదీ వచ్చే ఏడాది ఫిబ్రవరి అని డాక్టర్లు చెప్పారు. దీంతో అంతా బాగానే ఉందని మహిళ తల్లిదండ్రులు భావిస్తుండగానే ఆమె అందరికీ షాక్ ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఆమె 7 నెలల గర్భవతి కాగా.. మరో రెండు నెలల్లో ఆమెకు డెలివరీ కావాల్సి ఉండగా.. ఎక్కడ ఉందోనని ఆ భర్త తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.

వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె తన ప్రియురాలితో వెళ్లిపోయిందని తెలిసినా.. ఎక్కడ ఉందనేది మాత్రం ఇంకా ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు. దీంతో నెలలు గడుస్తున్నా తన భార్య తిరిగి రాకపోవడంతో.. ఆ భర్త గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ వ్యవహారంపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు.. ఈనెల 24వ తేదీలోగా ఆ మహిళను కోర్టు ముందు ప్రవేశ పెట్టాలని గుజరాత్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Exit mobile version