ప్రజా పాలనలో పేద దళితుల పక్షాన పోరాడితే దాడి చేస్తారా

దళిత మహానాడు జిల్లా సహాయక కార్యదర్శి దాసరి రవికుమార్
దళిత బంధు నిధులు విడుదల చేయాలని దళితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దళితులపై దౌర్జన్యంగా దాడి చేసి అరెస్ట్ చేసిన కాంగ్రెస్ సర్కార్ ఎంత దూర్మార్గం దళితుల పక్షమున పోరాడటం తప్పాస్వాతత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా దళితులకు న్యాయం జరగటం లేదు అని మహానాడు జిల్లా సహాయక కార్యదర్శి రవికుమార్ అన్నారు. పాడి కౌసిక్ రెడ్డి ని అరెస్ట్ చెయ్యటం అప్రజాస్వామికం అని మాలా మహానాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఆయన చెప్పారు.
దళిత బంధు ఇవ్వాలని ప్రజాస్వామ్య పద్ధతిలో అడగడం కూడా నేరమేనా అని వారు అన్నారు. ఇలాంటి పద్ధతి ఏ రాష్ట్రంలో ఏ సి ఎం చెయ్యలేదు, దళితుల బ్రతుకుల్లో ఇక నైనా మార్పు వస్తుంది అని ఎన్నో ఎల్లా నుండి ఎదురు చూసాము అయినా మా బ్రతుకులు మారటం లేదు దళితుల బతుకులు మారాలని దళిత బంధు పథకం ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పది లక్షలు కాదు 12 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి నేడు దళిత బంధు అమలు చేయడం లేదని అడిగినందుకు అరెస్టులు చేయడం సమంజసం కాదని ఇటువంటి అణచివేత చర్యలు ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాలా మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిగొండ రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి రవి కుమార్ తీవ్రంగా ఖండించారు.

Join WhatsApp

Join Now