Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్సీ గా నన్ను గెలిపించండి : ఇంద్రా గౌడ్

WhatsApp Image 2025 02 24 at 6.48.13 PM
గజ్వేల్, 24 ఫిబ్రవరి 2025 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించాలని పట్టబద్రులకు విన్నవించుకున్న సిలివేరు ఇంద్ర గౌడ్. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో సిలివేరి ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్, మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు అండగా నిలవాలని, ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో క్రమ సంఖ్య నాలుగో నెంబర్ పై సిలివేరి ఇంద్రగౌడ్ అనే పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువత రాజకీయాల్లో రావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇస్తే యువతకు అండగా ఉంటానని తెలిపారు.
Exit mobile version