జిల్లా ఎస్పీ ఆదేశాలతో మట్కాపై ఉక్కుపాదం
తాడిపత్రిలో అక్కడి అర్బన్ పోలీసుల దాడులు
14 మంది మట్కారాయుళ్లు అరెస్టు… రూ.2.19 లక్షలు స్వాధీనం
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS ఆదేశాలతో తాడిపత్రి అర్బన్ పోలీసులు మట్కాపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రి పట్టణంలోని గాంధీకట్ట, శివాలయం ప్రాంతాలలో మట్కా రాస్తున్నట్లు సమాచారం అందడంతో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 14 మంది మట్కారాయుళ్లను అరెస్టు చేశారు. వీరి నుండీ రూ.2.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన మట్కారాయుళ్ల వివరాలు :
మకందర్ ఆరీప్ భాషా, ఓం శాంతి నగర్, తాడిపత్రి పట్టణం..ఉసురాళ్ల చంద్రశేఖర్, నందలపాడు, తాడిపత్రి పట్టణం మోమిన్ సాదిక్, శ్రీనివాసపురం, తాడిపత్రి పట్టణం) పి వరుణ్ కుమార్, ఓం శాంతి నగర్, తాడిపత్రి పట్టణంషేక్ షేక్షావలి, రాయచూర్ వీధి, తాడిపత్రి పట్టణం మహమ్మద్ మగ్దూం, అల్లాబకాస్ వీధి, తాడిపత్రి పట్టణం
7)ఎట్టి బాల నారాయణ, గార్లపాడు గ్రామం పుట్లూరు మండలం
8)షేక్ మహబూబ్, సిపిఐ కాలనీ, తాడిపత్రి పట్టణం
9)షేక్ సాహిదా, రాయచూర్ వీధి, తాడిపత్రి పట్టణం
10) సంజామల మన్సూర్, అంబేద్కర్ నగర్, తాడిపత్రి పట్టణం
11)బండారు జ్యోతి, అంబేద్కర్ నగర్, తాడిపత్రి పట్టణం
12)సంజామల వన్నూరుబి, అంబేద్కర్ నగర్, తాడిపత్రి పట్టణం
13)కక్కర వలీ నౌషాద్, విజయనగర్ కాలనీ తాడిపత్రి
14) దూదేకుల కుల్లాయప్ప, శ్రీనివాసపురం, తాడిపత్రి పట్టణం