స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు – పక్కనే నిద్రిస్తున్న మహిళ మృతి..!!

*స్కూటీకి ఛార్జింగ్ అవుతుండగా పేలుడు – పక్కనే నిద్రిస్తున్న మహిళ మృతి*

ఎలక్ట్రిక్​ స్కూటర్​ పేలి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో తెల్లవారుజామున ఇంటి ఆవరణంలో ఛార్జింగ్ పెట్టి వున్న ఎలక్ట్రిక్​ స్కూటీ పేలింది. మంటల ధాటికి స్కూటర్ కాలిపోయింది. దాంతో పాటు పక్కనే ఉన్న ఇతర పరికరాలు సైతం దగ్ధమయ్యాయి.

ఆ సమయంలో పక్కనే సోఫాలో నిద్రిస్తున్న వెంకటలక్ష్మమ్మ అనే వృద్ధురాలు శరీరం మొత్తం కాలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఊహించని ఘటనతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment