*మండలాల మహిళా సమైక్య. సమీక్షా సమావేశం*
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గ ప్రతినిధి ఏప్రిల్-17
కామారెడ్డి జిల్లా పిట్లం మండల సమాఖ్య నందు పిట్లం, పెద్ద కొడప్ గల్, జుక్కల్, బిచ్కుంద మండలాల వివోఏ, సీసీ, ఏపీఎం లకు జిల్లా డిఆర్డివొ. సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి వివోఏ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి ప్రతి పనిలో ప్రణాళిక తో ముందుకు వెళ్లాలని తెలియ జేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు అలాగే స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం రెండు ఏక కాలంలో జరగాలని అన్నారు. అదేవిధంగా మహిళా శక్తి, బ్యాంకు లింకేజీ, సంస్థ నిర్మాణం, సూక్ష్మ ఎంటర్ ప్రైజెస్, లోకోస్, అజీవిక,ప్రతి గ్రామ సంఘం ఒక మంచి ఆదాయం వచ్చే కార్యక్రమం చేపట్టాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమలో డీపీఎం లు సుధాకర్, రమేష్ బాబు,మండల ఎంపీడివో తదితరులు పాల్గొన్నారు.