Site icon PRASHNA AYUDHAM

పర్యావరణ పరిరక్షణకు మహిళా మోర్చా కృషి

IMG 20250624 200624

**పర్యావరణ పరిరక్షణకు మహిళా మోర్చా కృషి — నాగారం మున్సిపాలిటీలో మొక్కలు నాటిన కార్యక్రమం**

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 24

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (జూన్ 23) నుండి జన్మదినం (జూలై 6) వరకు జరగబోయే వార్షిక కార్యాచరణలో భాగంగా, నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌ఎల్ నగర్‌లోని శ్రీ స్వయంభు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు, మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ప్రత్యేకంగా “అమ్మ పేరు మీద మొక్కలు” నాటి పచ్చదనాన్ని ప్రోత్సహించారు. అదనంగా, ప్రజలకు మొక్కల పంపిణీ కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ కొల్లి మాధవి, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనన్న, నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ శ్యాంసుందర శర్మ, శ్రీనివాస్ గౌడ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుజాత నాయక్, సంధ్యారెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, పోతంశెట్టి, సురేందర్, శ్రీనివాస్, జ్యోతి పాండే, శైలజ, విజయలక్ష్మి, శారదతో పాటు మండల మహిళలు, మహిళా మోర్చా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్గొన్న ప్రతిఒక్కరూ తమ వంతు కృషి చేసి, పర్యావరణ పరిరక్షణకు అంకితభావాన్ని చాటారు.

Exit mobile version