Headlines:
-
“మహిళలకు భద్రత కల్పించడంలో ఏపీలో సమస్యలు: 10 సంవత్సరాల్లో 2 లక్షల కేసులు”
-
“వైసీపీ-టీడీపీ భద్రతపై రాజకీయాలు చేస్తూ మహిళల మానప్రాణాలను అలా చాటిన విధానం”
-
“నిర్భయ, దిశ చట్టాలు పేరుకే; అమలులో నెమ్మదిగా”
-
“మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యమం”
-
“10 సంవత్సరాల్లో మహిళలపై 2 లక్షల కేసులు, రాష్ట్ర భద్రత స్థితి నిరాశ”
ఇవ్వాళ శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనం.
2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట.
2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట.
తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ…
లేదు లేదు కూటమి అధికారంలో వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ..
మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారు.
గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే..
మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుంది.
మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని వైసీపీ, టీడీపీలు రెండు దొందు దొందే.
ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం.
సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం.
నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్పా అమలుకు నోచుకోలేదు.
నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలు అని చంద్రబాబు,
దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరి శిక్ష పడేలా చర్యలని జగన్ గారు మహిళల చెవుల్లో క్యాలి ఫ్లవర్లు పెట్టారు తప్పిస్తే…
చట్టాలను అమలు చేసిన దాఖలాలు లేవు.
భద్రతకు పెద్ద పీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్పా..
10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్షలు పడలేదు.
కేసులు చేదించాల్సిన పోలీసులను కక్ష్య సాధింపు రాజకీయాలకు వాడుతున్నారు తప్పిస్తే..
ఏనాడూ సక్రమంగా విధులు నిర్వర్తింపజేసింది లేదు.
అభివృద్ధిలో చివరి స్థానం.. మాదక ద్రవ్యాల వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానం.
ఇది మన రాష్ట్ర దుస్థితి.