ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 7 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద
టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా పత్రాలు అందజేత
టీ.ఎస్.జే.యు రాష్ట్ర అధ్యక్షుడు నారగోని పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో వరంగల్ టీఎస్ జేయు యూనియన్ సభ్యులందరికీ ఐదు లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అందజేశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబంధించిన బీమా పత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారదా చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. టీఎస్ జెయు ఆధ్వర్యంలో జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించడం నిజంగా అభినందించదగ్గ విషయం అని అన్నారు. కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం గౌడ్ నారగోని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల నరేష్, జిల్లా అధ్యక్షులు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి, ఉపాధ్యక్షులు లింగబత్తిని కృష్ణ, కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, బత్తుల సత్యం, సభ్యులు కౌడగాని మోహన్ రావు, నీరుటి శ్రీహరి, అడుప అశోక్, మంతెన సురేష్, అవినాష్, బొక్క రాజు తదితరులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా అవసరం
