వరల్డ్కప్ వినాయకుడు వచ్చేశాడు..
ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ను భారత జట్టు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో కొందరు భక్తులు టీ20 వరల్డ్కప్ థీమ్తో గణేశుడిని రూపొందించారు. ట్రోఫీని మూషికుడు ఎత్తుకోగా గణేశుడి చేతిలో జెండాతో ఉన్న విగ్రహం వైరలవుతోంది. ఈ విగ్రహాన్ని ముంబై నగరంలో వినాయకచవితి రోజున ప్రతిష్ఠించనున్నట్లు సమాచారం. కాగా, మన దేశంలో ఏడాదిలో జరిగిన అద్భుతమైన ఘటనలతో వినాయకులను తయారు చేసి అభిమానాన్ని చాటుకోవడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.