ప్రపంచ పొదుపు దినోత్సవం పురస్కరించుకొని ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త ఎం శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా పోదుపు దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా జరుపుకుంటారని తెలిపారు. ప్రజలందరికీ పొదుపు రోజు యెుక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసం ఈ పొదుపు దినోత్సవ జరుపుకోవడం జరుగుతుంది. ఇది 1924 లో ఇటలీలో మిలాన్ నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు సమావేశం అక్టోబర్ 30న ప్రపంచ పొదుపు దినోత్సవం గా ప్రకటించిన్నారు. సహజ వనరులను పొదుపు చేసుకునే విధంగా విద్యుత్, నీరు, ఆహారం, పెట్రోల్, డీజిల్, సహజవాయువులు తదితర అవసరాలను అవసరానికి మించి వినియోగించకుండా అవసరానికి తగ్గట్టుగా పొదుపుగా వాడుకొనుటకు వృధా కాకుండా చూసుకుంటూ పొదుపు చేయడం అంటే ఉత్పత్తి చేయటం లాగా భావించాలి. పొదుపు దినోత్సవం గా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 30న నిర్వహించి ప్రజలకు అనవసరంగా వినియోగించకుండా అవసరాన్ని మించి వాడకుండా పొదుపుగా క్రమబద్ధంగా వినియోగించుకోవడాన్ని పొదుపు దినోత్సవం గా జరుపుకుంటారు అని ప్రముఖ వ్యాపారి సామాజికవేత ఎం శ్రీనివాస్ కుమార్ తెలిపారు.