హనరీ డాక్టరేట్, సేవారత్న అవార్డు లను అందుకున్న యలమంచి ఉదయ్ కిరణ్..
శేరిలింగంపల్లి జూన్ 28: ప్రశ్న ఆయుధం
నియోజకవర్గంలో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు ను స్థాపించి ట్రస్టు ద్వారా అచిర కాలంలో విస్తృతమైన విశిష్ట సేవలు ప్రజలకు అందించిన విధానంను వారి సేవలను గుర్తించి శనివారం రోజున ఇంటర్నేషనల్ జి హెచ్ పి యూనివర్శిటీ నుండి “సోషల్ వర్క్” లో గౌరవ హానరీ డాక్టరేట్ దేశవ్యాప్తంగా సామాజిక సేవలో అద్భుత కృషికి “సేవా రత్న జాతీయ అవార్డును మియాపూర్ డివిజన్ కి చెందిన యలమంచి ఉదయ్ కిరణ్ కి అందించారు. ఈ కార్యక్రమం చెన్నైలోని భారతీయ విద్యా భవన్ వేదికగా జరిగింది.ఈ వేడుకలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి , ప్రముఖ ఐ.ఎ.ఎస్ , ఐ.పి.ఎస్ అధికారులు, కమిషనర్ , ప్రిన్సిపల్ సెక్రటరీ ,మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్,లెఫ్టినెంట్ కర్నల్ (రిటైర్డ్), భారత శిక్షా రత్న అంతర్జాతీయ కమిషనర్ –యువ వ్యవహారాల , క్రీడల మంత్రిత్వ శాఖ డైరెక్టర్,ఇండియన్ ఆర్మీ,ఎడ్యుకేషన్ అంబాసిడర్, మరియు ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డ్స్ ని ప్రదానం చేశారు.ఈ గౌరవ పురస్కారాలు వ్యక్తిగత విజయాల కంటే, మనందరి కలిసికట్టుగా సాగిన మార్పు యాత్రకు గుర్తింపు. ప్రతి సేవా చర్య, ప్రతి సహకార దశ, ప్రతి మనిషి జీవితం కోసం మనం చేసిన ప్రయత్నానికి ఇది ప్రతిబింబం అని ఈ గౌరవాలను నా వెంట నడిచిన ప్రతి వాలంటీర్కు, ఆశీర్వాదాలిచ్చిన ప్రతి మిత్రునికి, ప్రోత్సహించిన నాయకులకు, మార్పు కోసం కలలు కనే ప్రతి చేంజ్మేకర్కు నేను అంకితం చేస్తున్నాను అని తెలిపారు. ఈ గౌరవాలు ముగింపు కాదు మరింత బలంగా, మరింత బాధ్యతతో ముందుకు సాగాలన్న పిలుపు!నాయకత్వం అంటే సేవ — నిజాయితీగా సేవ చేస్తే ప్రపంచం దానిని గౌరవిస్తుంది.ఈ గౌరవాలను అందించిన సంస్థలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఇది ఓ కొత్త సంకల్పం ఆరంభం మరిన్ని జీవితాల్ని స్పృశించాలి, మరిన్ని మార్పులను నడిపించాలి. మన మార్పు యాత్ర కొనసాగాలి… సేవే శాశ్వత మార్గం అని యలమంచి ఉదయ్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాలను తాకుతూ, మియాపూర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతును పొందుతున్నాయి. అటు రాజకీయ రంగంలో కూడా అందరూ మన్ననలు పొందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఇంతకముందు కూడా వీరి సేవలను గుర్తించి బెస్ట్ అచీవ్మెంట్స్ అవార్డును ప్రెస్ వింగ్స్ క్లబ్ నుండి అందుకున్నారు. ఈ గౌరవాలు ఆయనకు మరింత బాధ్యతను, సేవా సంకల్పాన్ని ఇచ్చాయి అని యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్టు చైర్మెన్, ఫౌండర్ యలమంచి ఉదయ్ కిరణ్ తెలిపారు.