రాష్ట్రపతి నిలయంలో ఘనంగా యోగా దినోత్సవం: నాగారం సెయింట్ మేరీస్ బెథాని కాలేజ్ ఆధ్వర్యంలో వేడుకలు

*రాష్ట్రపతి నిలయంలో ఘనంగా యోగా దినోత్సవం: నాగారం సెయింట్ మేరీస్ బెథాని కాలేజ్ ఆధ్వర్యంలో వేడుకలు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 22

నాగారం సెయింట్ మేరీస్ బెథాని కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రపతి నిలయంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 1.(టి) గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ లెఫ్ట్ నెంట్ కల్నల్ సంగీత కుమారి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేజర్ చాముండి ఎం క్యాడెట్స్, సెయింట్ మేరీస్ బెథాని కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిస్టర్ బ్రిజితా, కేర్‌టేకర్ ఆఫీసర్ జె. శోభారాణి ఉత్సాహంగా పాల్గొన్నారు.

రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ డాక్టర్ రజినీ ప్రియ ముఖ్య అతిథిగా హాజరై, యోగా ప్రాముఖ్యతను వివరించారు. తన జీవితంలో యోగా ఎలా సానుకూల మార్పులు తెచ్చిందో ఆమె పంచుకోవడంతో కార్యక్రమానికి మరింత ఉత్సాహం వచ్చింది. ఈ సందర్భంగా క్యాడెట్లు వివిధ రకాల ఆసనాలను నేర్చుకుని, యోగా ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకున్నారు.

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా యోగా నిపుణులను ఆహ్వానించారు. అరుణ యోగా టీమ్ నుండి యామిని, బ్లీస్ యోగా నుండి రాధా క్రాంతి ప్రధాన బోధకులుగా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. నాషత్, శశి, అర్చన, వీణ, చైతన్య మూల్యాంకనకర్తలుగా వ్యవహరించారు. సుమారు 1500 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమం విజయవంతమైంది. యోగా పట్ల అవగాహన పెంచడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ వేడుకలు ఎంతగానో దోహదపడ్డాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment