*”జంఝావతి” కోసం “యోగ”*
*తక్షణమే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి
*ఒడిశా వివాదాన్ని పరిష్కరించాలి*
*పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలి
*జంఝావతి నది వద్ద యోగా చేసిన సాధనసమితి ప్రతినిధులు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 22 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తు మహేశ్వరరావు
పార్వతీపురం :
జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం యోగా చేసినట్లు జంఝావతి సాధన సమితి కార్యాచరణ కన్వీనర్ మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు అన్నారు. శనివారం ఆ సమితి ప్రతినిధులు వంగల దాలి నాయుడు, మరిశర్ల మాలతి, రేజేటి దయామణి తదితరులతో కలిసి కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మి పురం గ్రామ సమీపంలో గల జంఝావతి నది వద్ద యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో, రాష్ట్రంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. యోగాతో దేశాన్ని, రాష్ట్రాన్ని అంతటినీ ఒకే తాటి పైకి తెచ్చారన్నారు. చాలా సంతోషకరమన్నారు. అయితే రైతులకు ఎంతో ఉపయోగకరమైన జంఝావతి ప్రాజెక్టు పూర్తికి దృష్టి సారించిన పోవడం బాధాకరమన్నారు. గత 50 ఏళ్లుగా పూర్తికి నోచుకోని జంఝావతి ప్రాజెక్ట్ పై దృష్టి సారించి తక్షణమే పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో, ఒడిశాలో, కేంద్రంలో అనుకూల ప్రభుత్వాలు ఉండటంతో ప్రాజెక్టును వేధిస్తున్న ఒడిశా వివాదం పరిష్కారం సులభవంతం అవుతుందన్నారు. తక్షణమే పూర్తిస్థాయి ప్రాజెక్టు పనులు చేపట్టి రైతులకు 24,640 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందివ్వాలన్నారు. అప్పటివరకు రబ్బర్ డ్యామ్ ద్వారా 12 వేల ఎకరాలకు, లిఫ్ట్ ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలి వలస పోతున్నారన్నారు. ఈ ప్రాంతం వెనకబడి పోవడానికి ప్రాజెక్టు పూర్తి కాకపోవడమే అన్నారు. గత ఐదు దశాబ్దాలుగా పాలకులు ప్రాజెక్టును ఎన్నికల హామీగానే వినియోగించుకున్నారన్నారు. అంతేగాని ప్రాజెక్టును పూర్తి చేసే చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వాలు స్పందించి ప్రాజెక్టు ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులతో కలిసి జంఝావతి నది వద్ద యోగ ఆసనాలు వేసి 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.