*కొత్తగూడ ఎమ్ పీ పీ ఎస్. పాఠశాలలో అంగరంగ వైభవంగ యోగా దినోత్సవం*
*ప్రశ్న ఆయుధం, జూన్ 21, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
కొండాపూర్: కొత్తగూడలోని ఎమ్ పీ పీ ఎస్. మండల ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అంగరంగ వైభవంగ యోగా దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులందరు యోగాసనాలు వేసి ఆనందానుభూతిని పొందారు. ఇన్చార్జి హెచ్ ఎమ్. రమేష్ రాజ్ మాట్లాడుతూ, యోగా అనేది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని దానికి ప్రపంచంలో గొప్ప కీర్తిని తెచ్చిపెట్టిన ప్రధాన మంత్రి నరెంద్ర మోదీకి దన్యవాదాలు తెలిపారు. సినియర్ ఉపాధ్యాయులు నాగయ్య యోగా గురించి మాట్లాడుతూ, యోగా ద్వారా విద్యాలయాలలో ఆరోగ్యం భాగా వృద్ధి చెంది, విద్యార్థులు గొప్పగా ఎదుగుతారని. తెలిపారు, మహాలక్ష్మి టీచర్ యోగాను ప్రతిరోజు చెయ్యాలని అభిప్రాయ పడ్డారు . ఈ కార్యక్రమంలో పద్మజావాణి, విద్దారులను ప్రత్యేకంగా నిర్మించారు, యోగాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమన్ని పదజాకాణి, పద్మప్రియ , స్వప్న , మహాలక్ష్మీ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనురాధ, స్వాతి, శివ, టీచర్లు, మమత, పరిమళ అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.