గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించిన వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సర్పంచ్ గౌరీ శంకర్
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 28( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు
గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ హై స్కూల్ను సందర్శించడం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించడంతో పాటు, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్లు (టాయిలెట్స్) స్థితిని పరిశీలించాను.
అలాగే, హెడ్మాస్టర్ మరియు విద్యార్థులతో ప్రత్యేకంగా చర్చించడం ద్వారా విద్యార్థుల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది.
వారు పాఠశాలలో భోజనం, పారిశుధ్యం, బోధన విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు.
ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం విషయంలో వంట చేస్తున్న వారు చాలా చక్కగా వండి పెడుతున్నారని కూడా తెలియజేసియున్నారు.
పాఠశాలల మొత్తం 290 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు, గతంలో ఆర్ఎంఎస్ ఫండ్స్ తో మంజూరైన భవనం అసంపూర్తిగా ఉంది
ఈ పాఠశాలలో జిల్లాలోనే ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచిన ఎంతోమంది క్రీడాకారులు ఉండేవారు, అట్లాంటి పాఠశాలలో గత నాలుగు సంవత్సరాల నుండి పిడి పోస్ట్ ఖాళీగా ఉంది
ఇది కూడా మంజూరు అయి ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఫిట్నెస్ గా ఉండడానికి, క్రీడల్లో రాణించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పిడి పోస్ట్ మంజూరు చేయాలని కోరుతున్నాం
—సర్పంచ్, గుమ్మలక్ష్మీపురం వైసిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్ అధ్యక్షులు