జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్):4 విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మాత దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని కలెక్టర్ కోరారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాలు చేకూర్చాలని అభిలాషించారు. అందరూ శాంతియుత, ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now