సంగారెడ్డి, జనవరి 07 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి అదనపు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ నల్గొండ కలెక్టర్ గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆడిటోరియంలో వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీజేఏసీ సెక్రెటరీ జనరల్ డాక్టర్. డి.వైద్యనాథ్, ప్రధాన కాదర్శి డాక్టర్.ఎస్.సంతోష్ కుమార్, సంఘ నాయకులు వినయ్ కుమార్, బాలరాం, శిరీష తదితరులు పుష్ప గుచ్చం అందజేసి సన్మానించారు.
నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ను సన్మానించిన గెజిటెడ్ ఉద్యోగుల సంఘ నాయకులు
Updated On: January 7, 2026 9:30 pm