10లక్షల విలువ గల గంజాయి పట్టివేత..

సంగారెడ్డి ప్రతినిధి, మే 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): 10లక్షల విలువ గల 20.6 కేజీల గంజాయి, కారును ఎస్ టీఎఫ్ఏ టీం ఎక్సైజ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. వివరాలులోకి వెలితే.. మహారాష్ట్ర జౌరంగబాద్‌లోని ఒక కంపెనీలో అపరేటర్‌గా పని చేస్తాడు. వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 2023లో ఒకమారు గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్‌లో ఒకసారి పట్టుబడ్డాయి. ఈ కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చాడు. అయిన గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్ టీఎఫ్ఏ టీం ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడిన వెలుగులోకి వచ్చింది. జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌ అనే వ్యక్తి సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో కారులో వెళ్తుండగా.. గంజాయిని ఎస్ టీఎఫ్ఏ టీం లీడర్‌ అంజిరెడ్డి, టీం సిబ్బంది పట్టుకున్నారు. ఈ కేసుల్లో గంజాయిని కొనుగోలు చేసి అమ్మకాల కోసం తీసుక వెలుతున్న జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌, గంజాయి అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణ కొన అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉందని తెలిపారు. కారు, గంజాయి, నిందితుడు జలీలోద్దీన్‌ సిద్దిఖి అహ్మమద్‌ హుస్సెన్‌ అరెస్టు చేసి సంగారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్ టీఎఫ్ఏ టీం లీడర్‌ అంజిరెడ్డి తెలిపారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment