టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని కలిసిన 17వ, వార్డ్ అశోక్ నగర్ కాలనీ,సభ్యులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి పట్టణనానికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ గా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 17వ వార్డ్ అశోక్ నగర్ కాలనీ ఆంజనేయ ఆలయ కమిటీ సభ్యులు, శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, ఆంజనేయ స్వామి టెంపుల్ అధ్యక్షులు చుక్క రావు, స్నేహపురి కాలనీ అధ్యక్షులు, రమేష్, ప్రగతి నగర్ అధ్యక్షులు ప్రభాకర్, కాలనీ కుటుంబ సభ్యులు, శశిధర్, వినోద్ రెడ్డి, ప్రవీణ్, చిన్న రాజిరెడ్డి, పెద్ద రాజిరెడ్డి, కే రవి, శ్రీధర్ రావు, మాజీ కౌన్సిలర్ జూలరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.