సంగారెడ్డి ప్రతినిధి, మే 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): లారీలో అక్రమంగా 40 టన్నుల పీడీఎస్ బియ్యం తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పోచాపూర్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా.. కేఏ 56 7022 లారీ అనుమానస్పదంగా కనిపించడంతో అందులో బియ్యం సంచులు కనిపించాయి. వెంటనే విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై అధికారులకు తెలుపడంతో వారు వచ్చి అందులో పరిశీలించగా.. 40 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఈ లారీ కర్ణాటక లోని గురుమిట్కాల్ నుండి పిట్లం వెళ్తున్నట్టు తెలిసింది. వెంటనే అట్టి లారీ పై సివిల్ సప్లై డీటీ సజీద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓనర్ జాకిర్ మియా, డ్రైవర్ అనిల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ విజిలన్స్ వెంకటేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 40 టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
Published On: May 20, 2025 8:14 pm
