విద్యార్థులకు అన్ని చట్టలపైన అవగాహన ఉండాలి:* *జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులకు అన్ని చట్టలపైనా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య అన్నారు. మంగళవారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర ఆదేశాల ప్రకారం సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య మాట్లాడుతూ.. విద్యార్థులకు అన్ని చట్టలపైనా అవగాహన ఉండాలని, అందరు క్రమశిక్షణగా ఉండాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఎలా ఉండాలో చక్కగా చెప్పారు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అదే విధంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. గృహ హింస, బాల్య వివాహ నిషేధ చట్టం, పోస్కో చట్టం, వరకట్న నిషేధ చట్టాలపై అవగహన కలిగి ఉండాలని అన్నారు. మంచి చదువులు చదివి ఉన్నత ఎదుగుదల సూచించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు న్యాయ పరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, ఏదైనా న్యాయ సహాయం కోరితే సంగారెడ్డి న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంను సంప్రదించాలని అన్నారు. ఈ సదస్సులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment