విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి: విద్యుత్ శాఖ ఏఈ రాజేశ్వర్ స్వామి

IMG 20240721 203134
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 21 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి విద్యుత్ శాఖ ఏఈ రాజేశ్వర్ స్వామి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పొలాల వద్ద స్టార్టర్లు తడవకుండా చూసుకోవాలని సూచించారు. అదే విధంగా తెగిపడిన విద్యుత్ తీగలు ఉంటే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఏఈ రాజేశ్వర్ స్వామి తెలిపారు.

Join WhatsApp

Join Now