మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లపై చట్టరిత్య చర్యలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యా సంస్థల యాజమాన్యాలు డ్రైవర్లకు డ్రంక్ అండ్ టెస్ట్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలని, మద్యం తాగి వాహనాలు నడిపే డ్రైవర్లపై చట్టరిత్య చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం పటాన్ చెరు పరిధిలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్తున్న బస్ డ్రైవర్లకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి స్కూల్, కళాశాల యాజమాన్యాలు తమ బస్సు డ్రైవర్లను విధులలోనికి అనుమతించే ముందు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసిన తరువాతనే విధులలోనికి అనుమతించాలని సూచించారు. ఎవరైనా పోలీసుల చెక్కింగ్ లో పట్టుబడినట్లైతే డ్రైవర్ తో పాటు విధ్యాసంస్థల యాజమాన్యాలపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment