సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహాను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి.ప్రావీణ్య మర్యాద పూర్వకంగా బుధవారం మంత్రి నివాసంలో కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సంగారెడ్డి జిల్లాలో ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలను రూపొందించాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రైతు నేస్తం, భూభారతి చట్టం అమలు, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, శిశు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని మంత్రి, కలెక్టర్ కు సూచించారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యేలా కృషి చేయాలని మంత్రి సూచించారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన నూతన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: June 18, 2025 6:40 pm
