ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

IMG 20250621 104254
సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం యోగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు,విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో అనుసరించేందుకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. యోగ సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పర్చు కోవచ్చున్నారు. ప్రతి ఒక్కరూ దినచర్యలో యోగాను అలవాటుగా చేసుకోవాలని ఆకాంక్షించారు. యోగ అభ్యాసం ద్వారా విద్యార్థులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా, మానసికంగా స్థిరతను పొందేలా చేయవచ్చును.అలాగే, చదువుపై దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. యోగ అభ్యాసం విద్యార్థుల్లో ఒత్తిడి నివారణకు, ఏకాగ్రత పెంపుదలకు దోహదం చేస్తుందని తెలిపారు. నిత్య జీవితంలో యోగా భాగం అయితే, విద్యార్థులు అభ్యాసం, అభివృద్ధిలో ముందంజలో ఉంటారన్నారు. యోగ సాధన ద్వారా విద్యార్థులు మెరుగైన ఆరోగ్యం, చురుకుదనం సాధించగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి గాయత్రి దేవి, మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యుఓ) లలిత కుమారి, యువజన సేవల శాఖ అధికారి ఖాసీం బెగ్, ఆయుష్ శాఖ అధికారులు, పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, కళాశాల అధ్యాపకులు, ఎన్ సీ సీ విద్యార్థులు, విద్యార్థి, విద్యార్థినులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment