సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులను తుంగలో తొక్కి, జీవో నెంబర్ 1,10,92,42 లను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచి , పెంచిన ఫీజులను నోటీసు బోర్డులో పెట్టకుండా , నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ సంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు రెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫామ్ లు, పాఠ్య పుస్తకాల పేరిట దోపిడీ చేస్తున్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు కొనసాగిస్తున్నప్పటికీ విద్యా శాఖ అధికారులు స్పందించడం లేదని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశించి పాఠశాలల్లో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కు వినతి
Published On: June 23, 2025 6:16 pm
